ఆకట్టుకున్న కళాబృందాల ప్రదర్శన
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనసేవలో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాబృందాలు చక్కటి ప్రదర్శనలిచ్చాయి. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 11 కళాబృందాల్లోని కళాకారులు సంగీత, నృత్య ప్రదర్శనలతో అలరించారు.